తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, గోధుమకుంట గ్రామ సమీపంలోని శ్రీ భవతి క్షేత్రంలో ఓమౌజయః ఏకోపాసన మహాధర్మ శ్రీ సంస్థాన్ ఫౌండేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. శ్రీ భవతి క్షేత్రం ఇన్‌చార్జి శ్రీ ప్రజ్ఞానందా స్వామీజీ మాట్లాడుతూ.. భక్తి భావాలు కలిగినప్పుడే సమాజంలో మంచితనం, మానవత్వం వర్ధిల్లుతాయని అన్నారు. శ్రీశ్రీశ్రీ  సత్యభగవాన్ శ్రీప్రభూజీ మార్గదర్శకత్వం మేరకు సమాజ శ్రేయస్సు కోసం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. శ్రీ భవతి క్షేత్రం పాలకమండలి సభ్యులు, ఓమౌజయః విశ్వ మహిళా సేవా సమితి (AVMS) సభ్యులు మరియు ఇంటర్నేషనల్ ఓమౌజయః యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ (I AUYSA) సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.

Share.
Leave A Reply

తెలుగు